ఆ దేవుడే కాపాడాలి: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2021-07-30T00:35:57+05:30 IST

యోగి పాలనలో రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయిందని, ఇక రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలని ఆమె అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆ దేవుడే కాపాడాలి: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ప్రభుత్వం 500 మంది అంబులెన్స్ డ్రైవర్లను తొలగించడం పట్ల కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. యోగి పాలనలో రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయిందని, ఇక రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలని ఆమె అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘కరోనా వివత్కర సమయంలో ప్రజలకు ప్రాణాలకు తెగించి సేవలు చేస్తున్న అంబులెన్స్ డ్రవైర్లను ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ఈఎస్ఎమ్ఏ) పేరుతో తొలగించారు. వారు వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ ప్రభుత్వం దాన్ని ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావిస్తోంది. ఇలాంటి ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని ఆ దేవుడే రక్షించాలి’’ అని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.

Updated Date - 2021-07-30T00:35:57+05:30 IST