కనుల పండువగా స్వామివారికి సదస్యం

ABN , First Publish Date - 2021-06-23T06:11:02+05:30 IST

ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి పుణ్యక్షేత్రంలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం స్వామివారికి ఏకాంతసేవలు నిర్వహించారు.

కనుల పండువగా స్వామివారికి సదస్యం

ఆత్రేయపురం, జూన్‌ 22: ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి పుణ్యక్షేత్రంలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం స్వామివారికి ఏకాంతసేవలు నిర్వహించారు. అనంతరం పుష్పాలతో అలంకరించారు. వేదపండితులు, అర్చకులు వేదమంత్రాల సాక్షిగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి సదస్యం కనుల పండువగా నిర్వహించారు. ఆలయ ఈవో కృష్ణచైతన్య ఏర్పాట్లు నిర్వహించారు. బుధవారం స్వామివారికి నిత్యహోమం, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Updated Date - 2021-06-23T06:11:02+05:30 IST