వెంకన్న అన్నదాన ట్రస్టుకు రూ.1,23,210 విరాళం
ABN , First Publish Date - 2021-01-26T06:42:48+05:30 IST
వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన మునుకుట్ల వెంకట అన్నపూర్ణ రూ.లక్ష, రాజమహేంద్రవరానికి చెందిన గోవిందుశ్రీకాంత్, సత్యశాంతి దంపతులు రూ.23,210 అందించారు.
ఆత్రేయపురం, జనవరి 25: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన మునుకుట్ల వెంకట అన్నపూర్ణ రూ.లక్ష, రాజమహేంద్రవరానికి చెందిన గోవిందుశ్రీకాంత్, సత్యశాంతి దంపతులు రూ.23,210 అందించారు. దాతలకు ఆలయ చైర్మన్ రమేష్రాజు స్వామివారి చిత్రపటాలు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో సతీష్రాజు ఏర్పాట్లు పర్యవేక్షించారు.