వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2020-12-05T06:38:28+05:30 IST

మాచవరం శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన 27అడుగుల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ

అంబాజీపేట, డిసెంబరు 4: మాచవరం శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన 27అడుగుల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. వేదపడింతులు మాచరి వెంకటరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి సుమారు వెయ్యి లీటర్లతో క్షీరాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా శాంతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి  క్రేన్‌ ద్వారా  భారీగజమాలను అలంకరించారు. ఎఎంసీ చైర్‌పర్సన్‌ వాసంశెట్టి వరలక్ష్మి, ఐటీ విభాగం అధ్యక్షుడు దొమ్మేటి సత్యమోహన్‌ స్వామి వారిని దర్శించుకొన్నారు. అనంతరం ఆలయం వద్ద భక్తులను తీర్థ,ప్రసాదాలు అందించారు.  


Updated Date - 2020-12-05T06:38:28+05:30 IST