జీఓసీఎల్ లాభం రూ.18 కోట్లు
ABN , First Publish Date - 2020-08-06T07:07:35+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి జీఓసీఎల్ కార్పొరేషన్ ఏకీకృత ప్రాతిపదికన రూ.18.13 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.5.86 కోట్లతో పోలిస్తే 209 శాతం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి జీఓసీఎల్ కార్పొరేషన్ ఏకీకృత ప్రాతిపదికన రూ.18.13 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.5.86 కోట్లతో పోలిస్తే 209 శాతం పెరిగిందని కంపెనీ వెల్లడించింది. సమీక్ష త్రైమాసికానికి ఆదాయం రూ.142 కోట్లు నమోదైంది. కొవిడ్ ప్రభావం మొదటి త్రైమాసికం ఫలితాలపై ఉందని.. ద్వితీయ త్రైమాసికంలో కార్యకలాపాలు గాడిలో పడి మూడు, నాలుగు త్రైమాసికాల్లో పుంజుకోగలవని భావిస్తున్నట్లు పేర్కొంది.