పిడుగుపాటుకు మేకలు మృతి

ABN , First Publish Date - 2020-06-03T10:11:53+05:30 IST

మండల పరిధిలోని చీమలపెంట గ్రామ పరిసర ప్రాంతాల్లో గుట్టల్లో సోమవారం పడిన పిడుగు పాటుకు 12 మేకలు చనిపోయాయి.

పిడుగుపాటుకు మేకలు మృతి

పెండ్లిమర్రి, జూన్‌ 2: మండల పరిధిలోని చీమలపెంట గ్రామ పరిసర ప్రాంతాల్లో గుట్టల్లో సోమవారం పడిన పిడుగు పాటుకు 12 మేకలు చనిపోయాయి. మేకల కాపరి చిన్న గంగయ్య కూడా పిడుగుపాటుకు స్పృహ కోల్పోయాడు. ఈ విషయం స్థానిక ప్రజలు తహసీల్దారుకు తెలపడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని సొంత వాహనంలో వెల్లటూరు తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం తహసీల్దారు ఉదయభాస్కర్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చేస్తానని తెలిపారు.

Updated Date - 2020-06-03T10:11:53+05:30 IST