మేకల దొంగల్ని అడ్డుకున్న వీరుడి పేరుతో శిలాఫలకం

ABN , First Publish Date - 2022-03-15T15:53:37+05:30 IST

మేకల దొంగల్ని అడ్డుకుని ప్రాణాలర్పించిన వీరుడి పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తిరుపత్తూరు జిల్లా కొరటి చెరువు సమీపంలో పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. నిజానికి ఆ చెరువు ఒడ్డున

మేకల దొంగల్ని అడ్డుకున్న వీరుడి పేరుతో శిలాఫలకం

వేలూరు(చెన్నై): మేకల దొంగల్ని అడ్డుకుని ప్రాణాలర్పించిన వీరుడి పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తిరుపత్తూరు జిల్లా కొరటి చెరువు సమీపంలో పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. నిజానికి ఆ చెరువు ఒడ్డున వున్న శిలాఫలానికి స్థానికులు పొంగళ్లు పెట్టి, మేకల్ని బలిచ్చి పూజలు నిర్వహించేవారు. అయితే స్థానికుల సమాచారం మేరకు పురావస్తుశాఖ అధికారులు ఆ శిలాఫలాకాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదడుగుల ఎత్తు, మూడడుగుల వెడల్పు కలిగిన ఈ శిలాఫలకంపై లిఖించి వున్న అక్షరాలను చూసి అదికారులు ఆశ్చర్యపోతున్నారు. తిరుపత్తూరు సమీపంలోని ఆలంపట్టి గ్రామవాసులకు చెందిన మేకల మందను దొంగలు తీసుకెళ్తుండగా, పెరియసందై నీలనార్‌ అనే యువకుడు వారిని అడ్డుకుని, మేకల మందను విడిపించాడు. అయితే ఆ తరువాత అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు గుర్తుగా ఆ గ్రామస్తులు ఆ శిలాఫలాకాన్ని ఏర్పాటు చేసినట్లు తిరుపత్తూరు జైన కళాశాల తమిళ్‌ శాఖాధిపతి మోహన్‌గాంధీ మీడియాకు తెలిపారు. ఆ శిలాఫలకం 1200 సంవత్సరాల నాటిదని వివరించారు.

Updated Date - 2022-03-15T15:53:37+05:30 IST