Goa గవర్నర్ ముందస్తు అపాయింట్మెంట్ కోరిన కాంగ్రెస్
ABN , First Publish Date - 2022-03-10T13:44:21+05:30 IST
గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది...
ఎన్నికల్లో మెజారిటీపై ధీమా
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీపై నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ ాపర్టీ 2017 ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు చెప్పారు.అందుకే తాము గవర్నర్ ముందస్తు అపాయింట్ మెంట్ కోరామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై అపాయింట్మెంట్ ఇవ్వాలని తాము కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.