ఘనంగా గోపూజ

ABN , First Publish Date - 2021-01-16T06:16:22+05:30 IST

ఘనంగా గోపూజ

ఘనంగా గోపూజ

వన్‌టౌన్‌, జనవరి 15 : పాతబస్తీలోని పలు ఆలయాల్లో శుక్రవారం గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది.  భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆలయ ఈవో ఎస్‌.హేమలతాదేవి, ఆలయ పాలక మండలి చైర్మన్‌ పి.రాజశేఖర్‌  గోపూజ మహోత్సవం ప్రారంభించారు.   

ఫ బ్రాహ్మణవీధిలోని వేంకటేశ్వరస్వామి దేవ స్థానం ఈవో గెల్లి హరిగోపినాథ్‌బాబు, ఆలయ పాలక మండలి చైర్మన్‌ జి.పాపారావు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో గోపూజ  జరిగింది.  

ఫ కృష్ణానది ఒడ్డున ఉన్న శనైశ్వరస్వామి ఆలయంలో ఈవో గెల్లి హరిగోపినాథ్‌బాబు పర్య వేక్షణలో గోపూజా కార్యక్రమం జరిగింది. అర్చ కులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఫ భవానీపురం హెచ్‌బీ కాలనీలోని కోదండ రామాలయంలో సామూహిక గోపూజ కార్యక్రమం జరిగింది. విశ్వనాథశాస్త్రి పూజ నిర్వహించారు.  

ఫ గవర్నర్‌పేట: చల్లపల్లి బంగ్లా సమీపంలోని  కాశీవిశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం ఆవరణలో శుక్రవారం దేవదాయ ధర్మదాయ శాఖ, టీటీడీ సౌజన్యంతో గోమాతకు గోపూజ నిర్వహించారు. 

ఫ విజయవాడ రూరల్‌  :  నున్న, కొత్తూరు తాడేపల్లిలో గోపూజా కార్యక్రమాలను శుక్రవారం భక్తిశ్రద్థలతో నిర్వహించారు. నున్నలో కాశీ విశ్వశ్వర, రామలింగేశ్వర, వేణుగోపాలస్వామి ఆలయాలలో జరిగిన గోపూజలో యోగీశ్వర్‌ దేవీదయాల్‌ మహామందిర్‌ ప్రధాన యోగాచార్య అమిత్‌ దేవ్‌జీ, శివాచార్య మామిళ్లపల్లి ఫణికుమార్‌ పాల్గొన్నారు.

ఫపెనమలూరు : యనమలకుదురు   సంతాన వేణు గోపాలస్వామి ఆలయంలో దేవదాయ ధర్మా దాయ శాఖ, టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో గో పూజా కార్యక్రమాలను నిర్వహించారు

Updated Date - 2021-01-16T06:16:22+05:30 IST