చేపల వేటకు వెళ్లి యువకుడి గల్లంతు

ABN , First Publish Date - 2021-07-25T05:26:12+05:30 IST

చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు అయిన సంఘటన శనివారం మండలంలోని గొట్టిపర్తి గ్రామంలో చోటుచేసుకుంది.

చేపల వేటకు వెళ్లి యువకుడి గల్లంతు

తుంగతుర్తి, జూలై 24 : చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు అయిన సంఘటన శనివారం మండలంలోని గొట్టిపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అన్నెబోయిన పరశురాములు(31) శనివారం సాయంత్రం మత్స్యకార్మికులతో కలిసి కేతిరెడ్డి వాగు వద్దకు చేపల వేటకు వెళ్లాడు. వాగులోకి దిగి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తుండగా వరద ఉధృతికి అతడి భుజంపైన ఉన్న వల జారి కాలుకు చిక్కుకుని వరదలో కొట్టుకుపోయాడు. వెంటనే అతడి కోసం గాలించినా ఫలితం లేకపోయింది. రాత్రి 9 గంటల వరకు అతడి ఆచూకి లభించలేదు. 


Updated Date - 2021-07-25T05:26:12+05:30 IST