భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక జీవోలు

ABN , First Publish Date - 2022-01-15T05:56:14+05:30 IST

ధరల దరువు, పేదల ఇళ్లకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌), ఆస్తి పన్ను పెంపు, చెత్తపై యూజర్‌ చార్జీ వసూలు...తదితర సమస్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు.

భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక జీవోలు

అగ్నికి ఆహుతి చేసి నిరసన తెలిపిన టీడీపీ నాయకులు

ధరల దరువు, పేదల ఇళ్లకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌), ఆస్తి పన్ను పెంపు, చెత్తపై యూజర్‌ చార్జీ వసూలు...తదితర సమస్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలు ప్రజా వ్యతిరేకమంటూ వాటి ప్రతులను భోగి మంటల్లో వేసి అగ్నికి ఆహుతి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని, పాలకుల మనసు మారాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2022-01-15T05:56:14+05:30 IST