రూ3 లక్షల మద్యం కేసులో ఇద్దరి అరెస్టు
ABN , First Publish Date - 2020-10-30T09:56:58+05:30 IST
తెలంగాణ నుంచి ఆంధ్రకు తరలిస్తున్న రూ.3 లక్షల మద్యంను గురువారం తెలంగాణలోని కోదాడ పోలీసులు పట్టుకున్నారు.
కోదాడ టౌన్, అక్టోబరు 29: తెలంగాణ నుంచి ఆంధ్రకు తరలిస్తున్న రూ.3 లక్షల మద్యంను గురువారం తెలంగాణలోని కోదాడ పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోకి గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెం, మాచవరానికి చెందిన బండ్ల రామారావు, ఎర్రమల్ల సురేష్లు అనుమతి లేకుండా ట్రాలీ ఆటోలో మద్యంను తరలిస్తున్నట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. వాహన తనిఖీలలో భాగంగా పట్టణ ఎస్ఐ రవీందర్ ఆ మద్యాన్ని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.