మదర్సాలకు విద్యా కానుక చారిత్రాత్మకం
ABN , First Publish Date - 2020-10-30T09:59:01+05:30 IST
ప్రభుత్వ పాఠశాలలతో పాటు ముస్లిం మైనార్టీలు విద్యనభ్యసించే మదర్సాలలో కూడా జగనన్న విద్యా కానుక అందించటం చారిత్రాత్మకమని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు.
గుంటూరు, అక్టోబరు 29: ప్రభుత్వ పాఠశాలలతో పాటు ముస్లిం మైనార్టీలు విద్యనభ్యసించే మదర్సాలలో కూడా జగనన్న విద్యా కానుక అందించటం చారిత్రాత్మకమని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు. పాతగుంటూరు శివారులోని మదర్సా పాఠశాలలో గురువారం జగనన్న విద్యా కానుక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్గాంధీ, కావటి మనోహర్నాయుడు, షేక్ షౌకత్, తోట ఆంజనేయులు, మీరావలి, మహమూద్, కొండారెడ్డి తదితరులున్నారు.