పులిచింతలకు లక్షా 92 వేల క్యూసెక్కులు..

ABN , First Publish Date - 2020-10-02T07:16:42+05:30 IST

సత్రశాలలోని కృష్ణానదిపై నిర్మితమైన సాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు 17 క్రస్ట్‌ గేట్ల నుంచి లక్షా 92 వేల క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నట్లు ఎస్‌ఈ శ్రీరామిరెడ్డి చెప్పారు.

పులిచింతలకు లక్షా 92 వేల క్యూసెక్కులు..

రెంటచింతల: సత్రశాలలోని కృష్ణానదిపై నిర్మితమైన సాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు 17 క్రస్ట్‌ గేట్ల నుంచి లక్షా 92 వేల క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నట్లు ఎస్‌ఈ శ్రీరామిరెడ్డి చెప్పారు. 10 గేట్లను 2.11 మీటర్ల మేర, 7 గేట్లను 1.67 మీటర్ల మేర ఎత్తామన్నారు.


ఎగువన ఉన్న సాగర్‌ నుంచి లక్షా 92 వేల క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వస్తుందన్నారు. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 247.77 అడుగులు కాగా ప్రస్తుతం 244.09 అడుగులుందన్నారు.  

Updated Date - 2020-10-02T07:16:42+05:30 IST