20 క్రస్ట్గేట్ల ద్వారా నీటి విడుదల
ABN , First Publish Date - 2020-10-02T07:15:30+05:30 IST
జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్లకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 20 క్రస్ట్గేట్ల ద్వారా అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
విజయపురిసౌత్, అక్టోబరు 1: జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్లకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 20 క్రస్ట్గేట్ల ద్వారా అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. గురువారం నాటికి సాగర్ నీటిమట్టం 590.00 అడుగులు(312.04 టీఎంసీలు) ఉంది. కుడి కాలువ ద్వారా 8,755 క్యూసెక్కులు, 20 క్రస్ట్గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,62,000 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ 1800 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 5654 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,948 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 600 క్యూసెక్కులు, మొత్తం ఔట్ఫ్లోగా 2,07,757 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం నుంచి సాగర్కు ఇన్ఫ్లో వాటర్గా 2,07,757 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.70 అడుగులుంది. ఇది 213.88 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి 83,587 క్యూసెక్కులు, రోజాల నుంచి 62,762 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 23,100 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతోంది. మొత్తం ఇన్ఫ్లోగా 1,69,449 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది.