మద్దాళి సుబ్బారావుకు పలువురి నివాళి
ABN , First Publish Date - 2020-09-29T10:44:17+05:30 IST
పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ తండ్రి, శ్రీ వెంకటశివపార్వతి స్పిన్నింగ్మిల్స్ ఎండీ సుబ్బారావు భౌతికకాయానికి పలువురు ప్రముఖులు సోమవారం నివాళులర్పించారు. ఆర్ అగ్రహారంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దనున్న నివాసంలో మద్దాళి సు
గుంటూరు, సెప్టెంబరు 28: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ తండ్రి, శ్రీ వెంకటశివపార్వతి స్పిన్నింగ్మిల్స్ ఎండీ సుబ్బారావు భౌతికకాయానికి పలువురు ప్రముఖులు సోమవారం నివాళులర్పించారు. ఆర్ అగ్రహారంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దనున్న నివాసంలో మద్దాళి సుబ్బారావు భౌతిక కాయానికి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు ఎండీ ముస్తఫా, కిలారి వెంకటరోశయ్య , నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ, వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్గాంధీ, వైసీపీ నేతలు కావటి మనోహర్నాయుడు, షేక్ షౌకత్, పోలూరి వెంకటరెడ్డి ఇతర నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం శ్రీనివాసరావుపేటలోని కైలాసభూమిలో అంత్యక్రియలు పూర్తి చేశారు.