జేసీబీ ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-09-28T11:12:01+05:30 IST
జేసీబీ ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన ముప్పాళ్లలో ఆదివారం చోటుచేసుకుంది.
ముప్పాళ్ళ, సెప్టెంబరు 27: జేసీబీ ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన ముప్పాళ్లలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన కందుల నాగబాబు(40) ఉదయం 10.30 గంటల సమయంలో పెదనందిపాడు బ్రాంచ్ కెనాల్పై ఉండగా చాగంటివారిపాలేనికి చెందిన జేసీబీ ఢీకొంది.
దీంతో నాగబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య అరుణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ నజీర్ బేగ్ పరిశీలించారు.