సీతానగరం ఆశ్రమంలో తీర్థగోష్టి
ABN , First Publish Date - 2020-09-28T11:09:25+05:30 IST
చినజీయర్ స్వామి తమ మాతృమూర్తి పరమపద కార్యక్రమాలను ముగించుకొని ఆదివారం సీతానగరం విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ భక్తులకు తీర్థగోష్టి, మంగళ శాసనాలు అందించారు. జీయర్ స్వామి అమ్మ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ..
తాడేపల్లి టౌన్, సెప్టెంబరు 27: చినజీయర్ స్వామి తమ మాతృమూర్తి పరమపద కార్యక్రమాలను ముగించుకొని ఆదివారం సీతానగరం విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ భక్తులకు తీర్థగోష్టి, మంగళ శాసనాలు అందించారు. జీయర్ స్వామి అమ్మ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ.. ఓంకార శబ్దం నుంచి అమ్మ అనే పదం వచ్చిందని తెలిపారు.
కార్యక్రమంలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ గోకరాజు గంగరాజు, డీసీపీ కోటేశ్వరరావు, విజయ డెయిరీ మిల్క్ ఫ్యాక్టరీ అధినేత ఆంజనేయులు, విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ లావు రత్తయ్య తదితరులు స్వామి వారిని కలిసి మంగళ శాసనాలు అందుకున్నారు.