తగ్గిన జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నష్టం

ABN , First Publish Date - 2021-06-19T05:35:01+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నష్టం తగ్గింది. ఏకీకృత ప్రాతిపదికన మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.723 కోట్ల నష్టా

తగ్గిన జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నష్టం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నష్టం తగ్గింది. ఏకీకృత ప్రాతిపదికన మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.723 కోట్ల నష్టా న్ని చవిచూసినట్లు కంపెనీ వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.1,127 కోట్లుగా  ఉంది. సమీక్షా త్రైమాసికానికి ఆదాయం కూడా రూ.2,554 కోట్ల నుంచి రూ.2,519 కోట్లకు తగ్గింది. మొత్తం ఏడాదికి రూ.6,863 కోట్ల ఆదాయంపై రూ.3,427 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 

Updated Date - 2021-06-19T05:35:01+05:30 IST