నేడు జీఎంపీఎస్ ‘ప్రగతి భవన్ ముట్టడి’
ABN , First Publish Date - 2020-09-21T07:54:04+05:30 IST
నేడు జీఎంపీఎస్ ‘ప్రగతి భవన్ ముట్టడి’
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): డీడీలు తీసిన రైతులకు గొర్రెల పంపిణీ చేయాలనే డిమాండ్తో గొర్రెలు, మేకల పెంపకందారుల సం ఘం (జీఎంపీఎస్) ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్ ముట్టడి కార్యక్ర మం చేపట్టినట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ తెలిపారు. గొర్రెలు వస్తాయన్న ఆశతో 28వేల మంది కురుమ, యాదవులు బ్యాం కుల్లో డీడీలు తీసి రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని గొల్ల, కురుమలంతా ప్రగతి భవన్ ముట్టడికి హాజరుకావాలని పిలుపునిచ్చారు.