త్వరలో ఎంజీ గ్లోస్టర్
ABN , First Publish Date - 2020-08-14T07:42:03+05:30 IST
ఎంజీ మోటార్ ఇండియా.. త్వరలో మార్కెట్లోకి ప్రీమియం ఎస్యూవీ ‘గ్లోస్టర్’ను తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పోలో ఎంజీ గ్లోస్టర్ను కంపెనీ ఆవిష్కరించింది..
న్యూఢిల్లీ: ఎంజీ మోటార్ ఇండియా.. త్వరలో మార్కెట్లోకి ప్రీమియం ఎస్యూవీ ‘గ్లోస్టర్’ను తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పోలో ఎంజీ గ్లోస్టర్ను కంపెనీ ఆవిష్కరించింది. నెక్ట్స్ జెనరేషన్ ఆటోమోటివ్ టెక్నాలజీతో ఈ ఎస్యూవీని తీసుకురానుంది. భారతీయ ఆటోమోటివ్ విభాగంలో గ్లోస్టర్ డిజైన్ కొత్త చరిత్ర సృష్టిస్తుందని తెలిపింది. 7 సీట్లతో కూడిన ఈ ఎస్యూవీ ధర రూ.35 లక్షలుగా ఉంటుందని అంచనా.