ఘనంగా విశ్వకర్మ జయంతి
ABN , First Publish Date - 2021-09-18T06:39:08+05:30 IST
విశ్వకర్మ జయంతి సందర్భంగా గోదావరిఖని లక్ష్మీనగర్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జెండావిష్కరణ చేశారు.
కళ్యాణ్నగర్, సెప్టెంబరు 17: విశ్వకర్మ జయంతి సందర్భంగా గోదావరిఖని లక్ష్మీనగర్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జెండావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్ణకారులకు అం డగా ఉంటున్నానని, వారికి ఏ ఇబ్బందులు ఎదురైనా తన వద్దకు నేరుగా రావచ్చునని, స్వర్ణకారుల షాపులపై గతంలో చీటికిమాటికి పోలీసులు దాడులు చేసే వారని, ఇప్పుడు అలా జరుగకుండా చేయడం జరుగుతుందన్నారు. రామగుండంలో మెడికల్ కళాశాల త్వరలోనే ప్రారంభమవుతుందని, మొదటి విడుత 150 మంది వైద్యులు, 500మంది నర్సింగ్ సిబ్బందిని నియమించడం జరుగుతుందని, రామగుండంలో క్రమేపి బొగ్గు గనులు మూత పడుతున్నప్పటికీ గోదావరిఖని మరో బెల్లంపల్లిగా కాకుండా ఉండేందుకు రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనీల్కుమార్, డిప్యూటీ మేయ ర్ అభిషేక్రావు, కార్పొరేటర్లు బాల రాజ్కుమార్, మేక ల సదానందం, నాయకులు తానిపర్తి గోపాల్రావు, రంగు శ్రీనివాస్, కొండపర్తి నరహరి, కట్ట సురేష్ భవా ని, రమేష్, ఉపేందర్, వేణు పాల్గొన్నారు.