వైభవంగా నిత్యవిధి కైంకర్యాలు
ABN , First Publish Date - 2021-06-24T06:37:09+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం నిత్యవిధి కైంకర్యాలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో స్వామి ని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు.
యాదాద్రిలో జస్టిస్ నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు
యాదాద్రి టౌన్, జూన్ 23: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం నిత్యవిధి కైంకర్యాలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో స్వామి ని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్లను ఆరాధిస్తూ సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణపర్వాలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. కొండపైన రామలింగేశ్వరుడికి, ఉపాలయంలో చరమూర్తులకు నిత్యపూజలు, కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ బెంచ్ న్యూదిల్లీ చైర్మన్, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, బాలాలయ కవచమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు.