ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
ABN , First Publish Date - 2022-01-19T05:36:22+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారత రత్న ప్రకటించాలని టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు.
మహబూబ్నగర్ టౌన్, జనవరి 18 : మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారత రత్న ప్రకటించాలని టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్టీఆర్ 26వ వ ర్ధంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ముందు ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వెంకటయ్యతో కలిసి ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడని కొనియా డారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పేదల ఆకలి తీ ర్చేందుకు 2 రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రాంభించారని గుర్తు చేశా రు. ఆయన ఏర్పాట్లు మండల వ్యవస్థ వల్ల ప్రజల్లో రాజకీయ చైతన్యం వ చ్చిందని కొనియాడారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం భారత రత్న ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నయ్య, యాదయ్య, శ్రీనివాస్, కుమార్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
హన్వాడలో ఘన నివాళి
హన్వాడ, జనవరి 18 : టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని మంగళవారం హన్వాడలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాకి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఖాసీం, నాయకులు మోహన్, తి ర్మలయ్య, బందెన్న, వెంకటయ్య, ఆంజనేయులు, కలీం, నర్సిములు పాల్గొన్నారు.