ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం

ABN , First Publish Date - 2022-05-17T06:27:29+05:30 IST

వారానికి ఒకరోజు డ్రై డే పాటించి డెంగ్యూ వ్యాధిని అరికడదామని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు.

ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం
డెంగ్యూ నివారణపై ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

పాడేరురూరల్‌, మే 16: వారానికి ఒకరోజు డ్రై డే పాటించి డెంగ్యూ వ్యాధిని అరికడదామని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు. సోమవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్‌వో రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ..   ప్రజలు ఇళ్లలో నిల్వ చేసే నీటిని వారానికి ఒకరోజు పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే పాటించాలన్నారు. అనంతరం జిల్లా ఆస్పత్రి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్‌, పీడీడీటీ టి.విశ్వేశ్వరనాయుడు, డీఎంవో సాంబమూర్తి, సూపర్‌వైజర్‌ పాత్రుడు, సబ్‌యూనిట్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌, భూపతిరాజు, ప్రసాద్‌, నాగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T06:27:29+05:30 IST