ఘనంగా నరసింహదేవర వర్ధంతి

ABN , First Publish Date - 2020-10-01T08:46:02+05:30 IST

దక్షణ భారతదేశంలో మొట్టమొదటి సహకార బ్యాంక్‌ వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్సీ నరసింహదేవర సత్యనారాయణ

ఘనంగా నరసింహదేవర వర్ధంతి

ఆలమూరు, సెప్టెంబరు 30: దక్షణ భారతదేశంలో మొట్టమొదటి సహకార బ్యాంక్‌ వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్సీ నరసింహదేవర సత్యనారాయణ 65వ వర్ధంతి ఆలమూరులో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సహకార సంఘంవద్ద నరసింహదేవర విగ్రహానికి చైర్‌పర్సన్‌ మేకా పురుషోత్తం పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో సంఘ పర్సన్స్‌ చల్లా నానాజీ, నాతి కుమార్‌రాజా, మాజీ అధ్యక్షుడు వంటిపల్లి సతీష్‌కుమార్‌, సీఈవో బొబ్బా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-01T08:46:02+05:30 IST