ఘనంగా ఎంఆర్ఈఎం ఇంజనీరింగ్ కళాశాల 14వ వార్షికోత్సవం
ABN , First Publish Date - 2022-06-27T05:16:45+05:30 IST
ఘనంగా ఎంఆర్ఈఎం ఇంజనీరింగ్ కళాశాల 14వ వార్షికోత్సవం
మేడ్చల్, జూన్ 26 : మేడ్చల్ మున్సిపాలిటీ కిష్టాపూర్ పరిధిలో గల ఎంఆర్ఈఎం ఇంజనీరింగ్ కళాశాల 14వ వార్షికోత్సవ సంబరాలు శనివారం రాత్రి ఘనంగా ముగిసాయి. మూడు రోజులపాటు నిర్వహించిన సంబరాల్లో మొదటిరోజు సంప్రదాయ దుస్తుల దినోత్సవంలో భాగంగా ఫ్యాకల్టీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2వ రోజు స్పోర్ట్స్డే సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. 3వ రోజు శనివారం రాత్రి కార్యక్రమంలో హైకోర్టు జడ్జి ఎస్.గోవర్ధన్రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థులు విద్యను సమాజ శ్రేయస్సుకు వెచ్చించి సద్వినియోగపర్చాలన్నారు. కాగా, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెఎన్టీయూ ప్రొఫెసర్ విశ్వనాథ్, మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నర్సింహారెడ్డి, కౌన్సిలర్ గణేష్, ప్రిన్స్పాల్ శ్రీధర్, కళాశాల చైర్మన్ వి.మల్లారెడ్డి, సెక్రటరీ వి.కృష్ణారెడ్డి, పాల్గొన్నారు.