ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2022-01-24T05:56:13+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
పాడేరురూరల్, జనవరి 23: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కుమ్మరిపుట్టులోని ఈశ్వరి స్వగృహంలో నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. అనంతరం లోకేష్ ఆరోగ్యం కుదుట పడాలని కోరుతూ మోదకొండమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరకులోయ ఆర్అండ్బీ అతిథిగృహం ఆవరణలో టీడీపీ మండల అధ్యక్షుడు శెట్టి బాబూరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సీవేరి అబ్రహం, పెదలబుడు సర్పంచ్ దాసుబాబు కేక్ను కట్ చేశారు. డుంబ్రిగుడ మండలం కొర్రా పంచాయతీ పెదపాడు గ్రామంలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. కొయ్యూరులో జీసీసీ మాజీ చైర్మన్ ఎంవీవీ ప్రసాద్ కేక్ కట్ చేసి అందరికి పంచారు.