ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2022-01-24T04:53:28+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఉత్సాహంగా పాల్గొని కేక్ కటింగ్లు, దేవాలయాల్లో పూజలు, మసీదుల్లో ప్రాఽర్థనలు నిర్వహించారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు ఇతర నేతలు పాల్గొని కేక్ కట్ చేశారు.
పలుచోట్ల కేక్ కటింగ్లు, పూజలు
ఉత్సాహంగా పాల్గొన ్న టీడీపీ శ్రేణులు
ఒంగోలు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఉత్సాహంగా పాల్గొని కేక్ కటింగ్లు, దేవాలయాల్లో పూజలు, మసీదుల్లో ప్రాఽర్థనలు నిర్వహించారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు ఇతర నేతలు పాల్గొని కేక్ కట్ చేశారు. మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుల నేతృత్వంలో జరగ్గా, వైపాలెంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నేత డాక్టర్ మన్నే రవీంద్ర కేక్ కట్ చేశారు. అలాగే అద్దంకి, చీరాల, కందుకూరు, గిద్దలూరు, కనిగిరి, సింగరాయకొండ, దోర్నాల, కంభంతోపాటు పలు మండల కేంద్రాల్లోనూ ఘనంగా జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు నిర్వహించారు.