వైభవంగా వెంకన్న కల్యాణం

ABN , First Publish Date - 2021-02-28T05:30:00+05:30 IST

తోటపల్లి శ్రీవెంక టేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం వెంకటేశ్వరస్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు

వైభవంగా వెంకన్న కల్యాణం

గరుగుబిల్లి, ఫిబ్రవరి 28: తోటపల్లి శ్రీవెంక టేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం వెంకటేశ్వరస్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఉభయ దేవాలయాల్లో ముందుగా ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు వీవీ అప్పలాచార్యులు, పి.గోపాలకృష్ణమాచార్యులు, కె.శ్రీనివాసా చార్యులు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో బి.లక్ష్మీనగేష్‌ మాట్లాడుతూ ప్రతివారం నిర్వహించే కల్యాణానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టానికి చెందిన ప్రముఖ యజ్ఞకర్త ఎస్‌వీఎల్‌ఎన్‌ శర్మ యాజీ సహకారం, ప్రోత్సాహంతో కల్యాణాలను నిర్వహిస్తున్నామన్నారు.  స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వారికి ఉచిత ప్రసాదాలు అందించి, అన్నసమారాధన నిర్వహించారు.


Updated Date - 2021-02-28T05:30:00+05:30 IST