వాయులింగేశ్వరుడి సేవలో గ్లోబల్ ఆస్పత్రి చైర్మన్
ABN , First Publish Date - 2021-02-24T07:20:11+05:30 IST
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన వాయులింగేశ్వరుడి దర్శనార్థం మంగళవారం గ్లోబల్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ రవీంద్రనాథ్ కుటుంబ సభ్యులతో కలసి విచ్చేశారు.
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 23: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన వాయులింగేశ్వరుడి దర్శనార్థం మంగళవారం గ్లోబల్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ రవీంద్రనాథ్ కుటుంబ సభ్యులతో కలసి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి, ఆలయ అఽధికారులు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆయన్ను ఆశీర్వదించి స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం రవీంద్రనాథ్ ముక్కటి బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. కార్యక్రమంలో దేవదాయ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణారెడ్డి, ఏఈవో ధనపాల్ తదితరులు పాల్గొన్నారు.