వరల్డ్ వైడ్ కరోనా మరణాలు @ 20 లక్షలు
ABN , First Publish Date - 2021-01-16T13:18:08+05:30 IST
కరోనా మహమ్మారి ఇప్పటికి 20 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ప్రపంచ దేశాలన్నింట్లో చోటుచేసుకున్న మరణాల సంఖ్య శుక్రవారంతో 20 లక్షలు దాటినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది.
న్యూఢిల్లీ, జనవరి 15: కరోనా మహమ్మారి ఇప్పటికి 20 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ప్రపంచ దేశాలన్నింట్లో చోటుచేసుకున్న మరణాల సంఖ్య శుక్రవారంతో 20 లక్షలు దాటినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. ఆయా దేశాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయని మృతుల వివరాలను ఇందులో చేర్చలేదని, ఇటువంటి మరణాల సంఖ్య కూడా లక్షల్లో ఉంటుందని అంటున్నారు. కాగా, ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య కన్నా మరో 20ు అధికంగా చనిపోయి ఉంటారని వాషింగ్టన్ యూనివర్సిటీలోని హెల్త్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ ముర్రే తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో కరోనా మరణాలు చోటుచేసుకోగా, ఆ తరువాతి స్థానాల్లో బ్రెజిల్, భారత్, మెక్సికో ఉన్నాయి.