మావోయిస్టులకు ఆశ్రయం కల్పించొద్దు : అడ్మిన్‌ డీసీపీ

ABN , First Publish Date - 2020-09-20T07:53:20+05:30 IST

మావోయిస్టుల కు ఆశ్రయం కల్పించినా, చట్ట వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడినా కేసులు తప్పవ ని రామగుండం అడ్మిన్‌ డీసీపీ అశోక్‌కు మార్‌ హెచ్చరించారు...

మావోయిస్టులకు ఆశ్రయం కల్పించొద్దు : అడ్మిన్‌ డీసీపీ

జన్నారం, సెప్టెంబరు 19: మావోయిస్టుల కు ఆశ్రయం కల్పించినా, చట్ట వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడినా కేసులు తప్పవ ని రామగుండం అడ్మిన్‌ డీసీపీ అశోక్‌కు మార్‌ హెచ్చరించారు. శనివారం అల్లినగర్‌ లో దొంగపెల్లి గ్రామాల్లో ఆదివాసీలకు అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ యువత కష్టపడి పనిచేసుకో వాలే తప్ప మావోయిస్టుల  మాట లు, పాటలకు ఆకర్షి తులై బంగారు జీవి తాన్ని నాశనం చేసు కోవద్దన్నారు. అక్క డు న్న ఆదివాసీలు వారి కుటుంబ సమ స్యలను పరిష్కరించాలని, ము ఖ్యంగా త్రీఫేజ్‌ కరెం టు విద్యుత్‌లైన్‌, బోరు బావులను నిర్మించి ఇవ్వాలని కోరడంతో సంబంధిత శాఖ అధికా రులతో మాట్లాడి తమవంతు సహా యం చేస్తానని ఈ సందర్భంగా డీసీపీ అశోక్‌కుమార్‌ హామీ ఇచ్చారు. అనంతరం పిల్లలకు పండ్లు, బిస్కెట్లు అందజేశారు. ఆయన వెంట సీఐ నారాయణనాయక్‌, ఎస్సైలు శ్రీకాంత్‌, చంద్రశేఖర్‌, మధుసూదన్‌రావు, సర్పంచ్‌ హన్మంతరావు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-09-20T07:53:20+05:30 IST