మేడారం జాతరకు రూ.112 కోట్లు ఇవ్వండి: సీతక్క

ABN , First Publish Date - 2021-10-07T00:46:04+05:30 IST

మేడారం మహాజాతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.112 కోట్ల నిధులు మంజూరు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క

మేడారం జాతరకు రూ.112 కోట్లు ఇవ్వండి: సీతక్క

ములుగు: మేడారం మహాజాతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.112 కోట్ల నిధులు మంజూరు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను బుధవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. జాతర నిర్వహణ కోసం వివిధ శాఖల అధికారులు ఇప్పటికే రూ.112 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించిన నేపథ్యంలో నిధులు మంజూరు చేయాలన్నారు. భక్తుల సౌకర్యాల దృష్ట్యా వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. అన్ని పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-10-07T00:46:04+05:30 IST