క్వారంటైన కేంద్రం భోజన బిల్లులు ఇవ్వండి

ABN , First Publish Date - 2021-06-25T06:39:57+05:30 IST

స్థానిక కరోనా క్వారంటైన కేంద్రంలో బాధితులకు భోజన సౌకర్యాలు అందించిన నిర్వాహకులకు బిల్లుల కోసం ఆందోళన చేపట్టారు.

క్వారంటైన కేంద్రం భోజన బిల్లులు ఇవ్వండి
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన భోజన నిర్వాహకులు

కళ్యాణదుర్గం, జూన 24: స్థానిక కరోనా క్వారంటైన కేంద్రంలో బాధితులకు భోజన సౌకర్యాలు అందించిన నిర్వాహకులకు బిల్లుల కోసం ఆందోళన చేపట్టారు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎ దుట భోజన నిర్వాహకులు వెంకటేశులు, హరిశంకర్‌ తదితరులు బై ఠాయించారు. నెలల తరబడి బిల్లులు అందించకపోవడంతో అధికారుల తీరుపట్ల అసహనం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా అప్పులుచేసి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదికి సంబంధించి బిల్లులు కూడా సక్రమంగా అందజేయలేదని మండిపడ్డారు. 15 రోజుల్లో బిల్లులు ఇస్తామని తహసీల్దార్‌ బ్ర హ్మయ్య గతంలో హామీ ఇచ్చి మోసం చేశాడని వాపోయారు. వెంట నే బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-06-25T06:39:57+05:30 IST