పింఛన్లు ఇప్పించండి

ABN , First Publish Date - 2021-01-19T05:26:19+05:30 IST

అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వాలని మండల సీపీఎం నా యకులు ఆర్‌.ఈశ్వరరావు, ఆర్‌. లక్ష్ముంనాయుడు డిమాండ్‌ చేశారు.

పింఛన్లు ఇప్పించండి

సీతానగరం, జనవరి 18: అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వాలని మండల సీపీఎం నా యకులు ఆర్‌.ఈశ్వరరావు, ఆర్‌. లక్ష్ముంనాయుడు డిమాండ్‌ చేశారు. మండలంలోని రంగం పేట గ్రామానికి చెందిన 11 మంది అర్హులైన వృద్ధులకు పింఛన్లు అందించాలని పరిపాలనాధికారి జి.శ్రీనివాసరావుకు తెలిపారు. ఈ సంద ర్భంగా వీరిరువురు మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన వృద్ధులు, వితంతు, విక లాంగులకు పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పి వివిధ కారణాలతో నిలిపి వేయడం అన్యాయమన్నారు. నిలిపివేసిన పింఛన్లకు ఏ కారణం చూపించ కపో వడం దారుణమన్నారు. మండల వ్యాప్తంగా 10 వేలకు పైగా పింఛన్లు ఉన్నప్ప టికీ వివిధ కారణాలతో 200 మంది లబ్ధిదారులకు నిలిపివేశారని, తక్షణమే వెరిఫికేషన్‌ చేసి పింఛన్లు అందించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం నాయకులు జి.వెంకటరమణ, ఈశ్వరరావు, లబ్ధిదారులు కె.సింహాచలం, అప్పలనాయుడు, అప్పలస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T05:26:19+05:30 IST