24 గంటల్లో వారికి ఎక్స్గ్రేషియా చెల్లించండి: జగన్ ఆదేశం
ABN , First Publish Date - 2020-04-10T18:57:05+05:30 IST
అమరావతి: ఏపీలో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే.
అమరావతి: ఏపీలో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అకాలవర్షాలపై సమీక్ష నిర్వహించారు. పంట నష్ట వివరాలు నమోదు చేసి తక్షణమే రైతులకు పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పిడుగుపాటు, బోటు ప్రమాదాల్లో మృతి చెందిన ఘటనల్లో బాధిత కుటుంబాలకు 24 గంటల్లో ఎక్స్గ్రేషియా చెల్లించాలని అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు.