‘సమాన వేతనం’ ఇవ్వండి!
ABN , First Publish Date - 2021-06-22T08:18:05+05:30 IST
సమానపనికి సమాన వేతనం ఇవ్వాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఏపీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ కార్యాలయాల ముందు
ఆందోళనకు దిగిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
గుంటూరు, జూన్ 21(ఆంధ్రజ్యోతి): సమానపనికి సమాన వేతనం ఇవ్వాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఏపీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ కార్యాలయాల ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేశారు. తెలంగాణలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేశారు. ఏపీలో 55 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ టైంస్కేల్ అమలు చేశారు. అదేతరహాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.