బాలికలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-09-25T05:11:31+05:30 IST
కౌమార దశలో ఉన్న బాలికలు పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు.
సిద్దిపేట కల్చరల్/సిద్దిపేట అర్బన్, సెప్టెంబరు 24: కౌమార దశలో ఉన్న బాలికలు పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. శనివారం శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంప్రదాయ బొడ్డెమ్మ పండుగను ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌమార దశలో ఉన్న బాలికలు మంచి పౌష్టికాహారం తీసుకుని రక్తహీనత లోపాన్ని అధిగమించాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు, అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్ మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని తీసుకుని ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్రెడ్డి, గైనకాలజిస్టు రజిని, కౌన్సిలర్ పూర్ణిమ ఎల్లం, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, బాలికలు పాల్గొన్నారు. అలాగే సిద్దిపేట అర్బన్ మండలంలోని మలబార్ గోల్డ్ షోరూంలో నిర్వహించిన జ్యువెలరీ ఫెస్ట్ను జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల ప్రారంభించారు.