అమ్మాయిల జైత్రయాత్ర
ABN , First Publish Date - 2022-06-23T08:57:54+05:30 IST
అమ్మాయిల జైత్రయాత్ర
ఐదు దేశాల హాకీ టోర్నీలో
ఉక్రెయిన్పై భారత్ గెలుపు
డబ్లిన్: అండర్-23 ఐదు దేశాల మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు అజేయంగా దూసుకెళుతోంది. టోర్నీలో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లు నెగ్గిన మన అమ్మాయిల బృందం మూడో మ్యాచ్లోనూ అదేజోరుతో విజృంభించింది. బుధవారం జరిగిన పోరులో భారత్ 3-0తో ఉక్రెయిన్ను చిత్తుచేసింది. భారత జట్టు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థికి ఒక్క గోల్కు కూడా అవకాశమివ్వకపోవడం విశేషం. నికిత (33వ నిమిషంలో), మంజూ చౌరాసియా (44వ), బీటీ దంగ్డంగ్ (55వ) తలో గోల్ సాధించారు.