వివాహానికి ముందు వచ్చిన మెయిల్ చూసి వధువు షాక్ .. చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్!
ABN , First Publish Date - 2022-07-12T02:38:11+05:30 IST
వారిద్దరికీ ఏడేళ్ల క్రితం పరిచయం జరిగింది.. ఆ పరిచయం ప్రేమగా మారడానికి ఏడాది సమయం పట్టింది..
వారిద్దరికీ ఏడేళ్ల క్రితం పరిచయం జరిగింది.. ఆ పరిచయం ప్రేమగా మారడానికి ఏడాది సమయం పట్టింది.. పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో అతడితో ఆ యువతి సహజీవనం చేసింది.. ఇద్దరూ ఇల్లు అద్దెకు తీసుకుని కలిసి జీవించారు.. అయితే ఇటీవల ఆ యవకుడు రహస్యంగా వేరే యువతితో నిశ్ఛితార్థం చేసుకున్నాడు.. పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు.. దీంతో బాధిత యువతి అత్యాచారం కేసు పెట్టింది.. ఆ ఎఫ్ఐఆర్ కాపీని వధువుకు పంపింది. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
Crime: భార్య గొంతు కోసి చంపిన భర్త.. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్య గురించి షాకింగ్ విషయాలు వెల్లడి..
ఇండోర్కు చెందిన అమూల్ గావ్లీ అనే యువకుడికి 2015లో బాధిత యువతితో పరిచయం ఏర్పడింది. 2016లో ఆమెకు అమూల్ ప్రపోజ్ చేశాడు. ప్రేమ పేరుతో ఇద్దరూ కలిసి తిరిగారు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ యువతికి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం ప్రారంభించారు. ఏడేళ్లు కలిసి జీవించిన యువతికి తెలియకుండా ఈ ఏడాది జూన్లో చంద్రాపూర్కు చెందిన అమ్మాయితో అమూల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. స్వగ్రామానికి వెళ్లిపోయి బాధిత యువతికి పూర్తిగా దూరమయ్యాడు. అమూల్ వివాహం గురించి తెలుసుకున్న బాధితురాలు జూన్లో మహిళా పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు పెట్టింది.
విచారణ అనంతరం పోలీసులు అమూల్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. అయితే అతడిని అరెస్ట్ మాత్రం చేయలేదు. దాంతో ఆమూల్ ఆమెను కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. మరోపక్క ఈ నెల 9న వివాహానికి మూహూర్తం పెట్టుకున్నాడు. బాధితురాలు సోషల్ మీడియా ద్వారా అమూల్కు కాబోయే భార్య వివరాలు సంపాదించింది. అత్యాచారానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని ఆమెకు పంపింది. వధువు కుటుంబ సభ్యులు ఇండోర్ పోలీసులతో మాట్లాడగా మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ వివాహం ఆగిపోయింది.