ప్రేమజంట ఆత్మహత్యాయత్నంలో ప్రేమికురాలి మృతి
ABN , First Publish Date - 2021-07-02T03:13:26+05:30 IST
జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
నెల్లూరు: జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికులను తేజశ్విని, వెంకటేశ్గా గుర్తించారు. ఈ ఘటనలో తేజశ్విని మృతి చెందింది. అయితే తేజశ్విని మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తేజశ్విని గొంతు భాగంలో తాడుతో నులిమిన గాయాలు కనబడుతున్నాయి. ప్రియుడు వెంకటేశ్ హత్య చేశాడని తేజశ్విని తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. ప్రియుడు వెంకటేశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రియుడు వెంకటేష్పై హత్యకేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.