ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్య
ABN , First Publish Date - 2021-04-12T22:42:42+05:30 IST
ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన నగరంలోని
హైదరాబాద్: ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన నగరంలోని కూకట్ పల్లిలోని ఏవీబీపురంలో చోటుచేసుకుంది. మంజుల, భూపతి అనే ఇద్దరు యువతీ,యువకులు కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. మంజుల(19)ను ఆమె ప్రియుడు భూపతి గొంతునులిమి దారణంగా చంపాడు. అనుమానంతో మంజులను భూపతి హత్య చేశాడు. హత్య అనంతరం మంజుల మృతదేహాన్ని నీటిసంపులో భూపతి పడేశాడు. అనంతరం పోలీసులకు భూపతి లొంగిపోయాడు.