ప్రేమించకపోతే చంపుతా..

ABN , First Publish Date - 2021-09-15T05:05:50+05:30 IST

‘నన్ను ప్రేమించు.. పెళ్లి చేసుకో.. లేకపోతే చంపేస్తా..’ అని పక్కింటి యువకుడు వేధిస్తుండటంతో బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన బాలిక (16) గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది.

ప్రేమించకపోతే చంపుతా..

యువకుడి వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య 


చేర్యాల, సెప్టెంబరు 14 : ‘నన్ను ప్రేమించు.. పెళ్లి చేసుకో.. లేకపోతే చంపేస్తా..’ అని పక్కింటి యువకుడు వేధిస్తుండటంతో బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన బాలిక (16) గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. ఆమె ఇంటి పక్కనే నివసించే కుర్ర మధు కొద్దిరోజులుగా తనను ప్రేమించాలని ఆమెను వేధిస్తున్నాడు. పెళ్లి చేసుకోకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయంపై యువతి కుటుంబ సభ్యులు మధును మందలించినా ప్రవర్తన మార్చుకోలేదు. సోమవారం కూడా అతడు బాలికకు ఫోన్‌చేసి బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాలిక తల్లికి విషయం చెప్పింది. అప్పటి నుంచి దిగులా ఉంటున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం తల్లి ఇంటి డాబా పైకి వెళ్లగానే లోపలి నుంచి తాళం వేసుకుని చున్నీతో ఉరేసుకున్నది. ఎంత పిలిచినా తలుపు తెరవకపోవడంతో తల్లి చుట్టుపక్కలవారి సహాయంతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లలోగానే బాలిక మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-09-15T05:05:50+05:30 IST