బాలికపై స్నేహితులతో కలిసి సోదరుడి అఘాయిత్యం

ABN , First Publish Date - 2020-08-21T14:52:05+05:30 IST

పదేళ్ల దివ్యాంగ బాలికపై సామూహిక అత్యాచారం చేసి, చంపిన దారుణ ఘటనలో ఆమె సొంత సోదరుడే ప్రధాన నిందితుడని....

బాలికపై స్నేహితులతో కలిసి సోదరుడి అఘాయిత్యం

జైపూర్ (రాజస్థాన్): పదేళ్ల దివ్యాంగ బాలికపై సామూహిక అత్యాచారం చేసి, చంపిన దారుణ ఘటనలో ఆమె సొంత సోదరుడే ప్రధాన నిందితుడని పోలీసుల దర్యాప్తులో తేలింది. జైపూర్ నగరంలో మే 17వతేదీన పదేళ్ల దివ్యాంగ బాలికపై సామూహిక అత్యాచారం చేసి, హతమార్చారు. ఈ ఘటనలో మృతురాలి సొంత సోదరుడే (20) బాలికను కిడ్నాప్ చేసి, తన ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేసి హత్య చేశారని జైపూర్ పోలీసులు తేల్చారు. జైపూర్ రూరల్ అదనపు ఎస్పీ సులేష్ చౌదరి ఈ కేసు మిస్టరీని ఛేదించారు. సోదరి అంటే ద్వేషంతో సొంత సోదరుడే చెల్లెల్ని కిడ్నాప్ చేసి, తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ దురాగతానికి పాల్పడినట్లు వెల్లడైంది. మే 17వతేదీన తన తల్లి జీన్స్, టీషర్టు కొనివ్వడంతో బాలిక సంతోషంగా ఉందని, అప్పుడు సోదరుడే తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేసి, ఆమెకు మొబైల్ ఫోన్ లో నగ్న చిత్రాలు చూపించి అత్యాచారం చేసి హత్య చేశారని సులేష్ చెప్పారు. సంఘటన జరిగిన స్థలంలో మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలినట్లు సోదరుడితో పాటు అతని ముగ్గురు స్నేహితులను గుర్తించారు. వారిని అరెస్టు చేశామని అదనపు ఎస్పీ సులేష్ చెప్పారు.

Updated Date - 2020-08-21T14:52:05+05:30 IST