14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన హోటల్ ఓనర్ భార్య.. ఆ బాలికను ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-04-29T06:13:32+05:30 IST

ఒక యువకుడు తన సోదరి తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మూడు రోజుల తర్వాత ఆ బాలిక తన సోదరుడికి ఫోన్ చేసి రక్షించమని వేడుకుంది. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేశారు. మథురలోని ఓ హోటల్ నుంచి ఆ కాల్ వచ్చినట్టు పోలీసులు కనుగొన్నారు...

14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన హోటల్ ఓనర్ భార్య.. ఆ బాలికను ఏం చేసిందంటే..

ఒక యువకుడు తన సోదరి తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మూడు రోజుల తర్వాత ఆ బాలిక తన సోదరుడికి ఫోన్ చేసి రక్షించమని వేడుకుంది. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  మథుర నగరానికి చెందిన ఒక హోటల్ నుంచి ఆ కాల్ వచ్చినట్టు పోలీసులు కనుగొన్నారు. వెంటనే అక్కడకు వెళ్లి గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో బంధించి ఉన్న బాలికను రక్షించారు.


ఢిల్లీకి చెందిన 14 ఏళ్ల బాలికను ఈ నెల 21వ తేదీన కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ బాలికను మధురలోని ఓ హోటల్ యజమానికి అమ్మేశారు. అతను ఆ బాలికకు నిరంతరం మత్తు ఇస్తూ ఆమె చేత వ్యభిచారం చేయించాడు. మూడ్రోజుల తర్వాత ఆ బాలిక ఓ కస్టమర్ ఫోన్ నుంచి తన అన్నయ్యకు ఫోన్ చేసింది. దీంతో ఆ బాలిక అన్నయ్య వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 


కాల్ లోకేషన్ ఆధారంగా పోలీసులు ఆ బాలిక ఉన్న స్థలాన్ని కనుగొన్నారు. పోలీసులు హోటల్‌పై దాడి చేసి యజమాని జుబీద్‌తో పాటు అతని సహచరుడు రవిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ ఆ హోటల్‌ను లీజుకు తీసుకొని అక్కడ వ్యభిచారం నడిపిస్తున్నారు. హోటల్ యజమాని జుబిద్ భార్య కొత్తగా వచ్చే అమ్మాయిలకు హింసిస్తూ వ్యభిచారం చేయించేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Updated Date - 2022-04-29T06:13:32+05:30 IST