కూతురిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడనే కోపంతో తండ్రి ఎంత పని చేశాడంటే.. పోలీస్ స్టేషన్ ఎదుటే ఘోరం.. `ఉప్పెన` సినిమా తరహాలో..

ABN , First Publish Date - 2021-12-25T21:56:30+05:30 IST

కొద్ది నెలల క్రితం విడుదలైన `ఉప్పెన` సినిమా తరహా లాంటి ఘటన తాజాగా రాజస్థాన్‌లో జరిగింది.

కూతురిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడనే కోపంతో తండ్రి ఎంత పని చేశాడంటే.. పోలీస్ స్టేషన్ ఎదుటే ఘోరం.. `ఉప్పెన` సినిమా తరహాలో..

కొద్ది నెలల క్రితం విడుదలైన `ఉప్పెన` సినిమా తరహా లాంటి ఘటన తాజాగా రాజస్థాన్‌లో జరిగింది. తన కూతురిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో యువతి తండ్రి దారుణంగా పగ తీర్చుకున్నాడు. యువకుడి మర్మాంగాన్ని కట్ చేసేశాడు. పోలీస్ స్టేషన్ ఎదుటే యువకుడిపై దాడి చేసి కిడ్నాప్ చేశాడు.. అనంతరం ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలోని సాగర్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


సాగర్‌పూర్‌కు చెందిన యువతీ యువకులు మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ పెళ్లికి యువతి తల్లిదండ్రలు అంగీకరించలేదు. దీంతో ఇటీవల ఆ యువతి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. స్నేహితుల అండతో కోర్టులో రెండ్రోజుల క్రితం ఆ యువతీ యువకులు వివాహం చేసుకున్నారు. తమకు భద్రత కల్పించాలని కోరేందుకు పోలీస్ స్టేషన్‌కు బయల్దేరారు. ఆ విషయం తెలుసుకున్న యువతి తండ్రి, సోదరుడు, మేనమామ స్టేషన్ బయటే కాపు కాశారు. 

 

పోలీస్ స్టేషన్ ఎదుటే వారిద్దరినీ కిడ్నాప్ చేశారు. వారిని ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ యువకుడిపై యువతి తండ్రి, సోదరుడు, మేనమామ దాడిచేశారు. యువకుడి మర్మాంగాన్ని కోసేశారు. బాధితుడు ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2021-12-25T21:56:30+05:30 IST