అన్నను కాపాడబోయి చెల్లె మృతి
ABN , First Publish Date - 2021-05-06T06:07:10+05:30 IST
అన్నను కాపాడబోయి చెల్లె మృతి
మంగపేట, మే 5: ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని కాపాడబోయిన సోదరి షాక్కు గురై మృతి చెందింది. ఈ ఘటన మంగపేటలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో బుధవా రం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగపేట వీఆర్ఏగా పనిచేస్తున్న దాసరి రాముకు కుమారుడు చరణ్కుమార్(14), కుమార్తె అమృత వర్షిణి(11) ఉన్నారు. వీరి ఇంటి సమీపంలో మూసి ఉన్న బిర్యానీ పాయింట్ వద్దకు చరణ్కుమార్ వెళ్లాడు. మంగళవారం ఈదురుగాలలతో అప్పటికే బిర్యానీ పాయింట్ షెడ్డుపై పడి ఉన్న తీగలకు విద్యుత్ సరఫరా అవుతుండటంతో గమనించలేదు. షెడ్డు లోపలికి అనుకోకుండా వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించి అన్నను కాపాడేందుకు యత్నించిన అమృత వర్షిణి కూడా విద్యాదాఘాతానికి గురైంది. చరణ్కుమార్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇద్దరిని స్థానికులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే అమృత మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. చరణ్కుమార్కు ప్రఽథమ చికిత్స చేసి, ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు రెఫర్ చేశారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.