ఇసాయిపేటలో బాలిక ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-21T05:40:49+05:30 IST

ఇం ట్లో ఎవరూ లేని సమయంలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుం ది.

ఇసాయిపేటలో బాలిక ఆత్మహత్య

మాచారెడి, ఏప్రిల్‌ 20: ఇం ట్లో ఎవరూ లేని సమయంలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుం ది. ఈ ఘటన మాచారెడ్డి మండలంలోని ఇసాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్రంగారి మహేశ్వరి(పూజ) (17) మాన సిక పరిస్థితి బాగా లేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాజంపేటలో..

రాజంపేట: కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజంపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రాజు(32) కొంతకాలంగా ఆర్థి క సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబంలో కలహలు రావడంతో మనస్థా పం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సునిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీష్‌ తెలిపారు.

Updated Date - 2021-04-21T05:40:49+05:30 IST