ప్రియుడితో గొడవ.. జీవితంలో మళ్లీ ఫోన్ చేయనున్న ప్రేయసి.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అర్ధరాత్రి అతడు వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-10-19T06:55:03+05:30 IST

ఈ మధ్య కాలంలో చిన్న, పెద్ద విషయం అనే తేడా లేకుండా ప్రాణాలు తీసేసుకుంటున్నారు. రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలో ఇలాంటి...

ప్రియుడితో గొడవ.. జీవితంలో మళ్లీ ఫోన్ చేయనున్న ప్రేయసి.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అర్ధరాత్రి అతడు వెళ్లి చూస్తే..

జైపూర్: ఈ మధ్య కాలంలో చిన్న, పెద్ద విషయం అనే తేడా లేకుండా ప్రాణాలు తీసేసుకుంటున్నారు. రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలో ఇలాంటి ఓ దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం ఇంట్లో ఉరితాడుకు వేలాడుతున్న ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. దాని ప్రకారం కూడా ఆమె ఆత్మహత్య చేసుకుందనే తేలింది.


పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. 18ఏళ్ల రాణి గుజ్జర్‌తో అదే ప్రాంతానికి చెందిన రామ్‌దీప్‌(25)కు వివాహేతర సంబంధం ఉంది. అయితే అక్టబోర్ 15 రాత్రి రాత్రి ఉన్నట్లుండి రామ్‌దీప్‌కు రాణి నుంచి కాల్ వచ్చింది. ఇకపై తాను తనతో మాట్లాడనని ఆ ఫోన్‌లో రాణి పేర్కొంది. అయితే మళ్లీ కొంతసేపటికి ప్రయత్నించిన రామ్‌దీప్‌‌కు.. ఈ సారి స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అతడికి భయం వేసింది. వెంటనే ప్రియురాలి ఇంటికి వచ్చి చేరుకున్నాడు. 

Updated Date - 2021-10-19T06:55:03+05:30 IST